calender_icon.png 21 October, 2024 | 7:54 AM

సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.39 లక్షలు రీఫండ్

16-10-2024 01:08:39 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): స్టాక్ ట్రేడింగ్‌లో అధిక లాభాలొస్తాయని సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయిన ఓ బాధితుడికి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఏకంగా రూ.39 లక్షల నగదును రీఫండ్ చేశారు. సైబర్ క్రైం యూనిట్ డీసీపీ దార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువకుడు సైబర్ మాయగాళ్ల గాలానికి చిక్కి రూ.78.70 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వారు చాకచక్యంగా వ్యవహరించి బాధితుడికి రూ.39లక్షలు రీఫండ్ అయ్యేలా చేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.