calender_icon.png 1 October, 2024 | 5:59 AM

రూ.18 లక్షలు పలికిన తైబజార్ వేలం

01-10-2024 02:09:53 AM

గజ్వేల్, సెప్టెంబరు 30: సిద్దిపేట జిల్లా నాచారం శ్రీ లక్ష్మీనరసింహస్వా మి ఆలయంలో తైబజార్ వేలంపాట ద్వారా రూ.18లక్షల 17వేల ఆదా యం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. నాచ గిరి క్షేత్రంలో వాహన పార్కింగ్ రుసు ము వసూలు చేయడానికి రూ.10వేలకు చిక్కడపల్లి శ్రీనివాస్, ఆలయ పరిధిలోని నీలగిరి చెట్లను రూ.10లక్షలకు భువనగిరిజిల్లాకు చెందిన సాయికుమార్ కైవసం చేసుకున్నారు.

షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాప్‌నెంబర్ 12, 13 దుకాణాలకు అద్దె ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ అతి తక్కువగా రూ.17వేలు కోడ్ చేయడంతో పాటు మిగతా వారు పాల్గొన కపోవడంతో రద్దు చేసినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు, సిబ్బంది సుధాకర్‌గౌడ్, నరేందర్‌గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.