calender_icon.png 18 October, 2024 | 6:48 AM

విమాన గోపుర బంగారు తాపడానికి 10 లక్షల విరాళం

18-10-2024 12:17:26 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమాన గోపుర బంగారు తాపడానికి భక్తుల నుంచి దేవస్థానం పాలకవర్గం విరాళాలు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. దీనికి భక్తుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన కంకర్ సుద్వీర్ రెడ్డి అనే భక్తుడు రూ.10,00,116 విరాళంగా ప్రకటించారు. ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావుకు విరాళం చెక్కును అందజేశారు.