calender_icon.png 2 October, 2024 | 9:56 PM

ఉద్యోగం కోసం 16 లక్షలు చెల్లింపు

02-10-2024 12:25:15 AM

మోసపోయిన దంపతులు.. గడ్డిమందు తాగి ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ఉద్యోగం ఇప్పిస్తానంటే అప్పుచేసి రూ.16 లక్షలు కట్టారు. ఉద్యోగం ఇప్పిస్తామన్న వ్యక్తి, అతడ్ని పరిచయం చేసిన వ్యక్తి కన్పించకపోవడంతో మోసపోయామని భావించి భార్యభర్తలిద్దరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో చోటు చేసుకుంది.

జూలూరుపాడు మండ లం సాయిరాం తండాకు చెందిన రత్నకుమార్, పార్వతి దంపతులు. గత కొంత కాలంగా చుంచుపల్లి మండలంలో నివాసం ఉంటూ షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తూ జీవ నం సాగిస్తున్నారు. ఇద్దరూ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఈ క్రమంలో మాల్స్‌లో ఓ వ్యక్తి పరిచయమై సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించాడు.

దీంతో ఆ దంపతులు రూ.16 లక్షలు అప్పు చేసి ఇచ్చారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి గత కొంత కాలంగా కన్పించకపోవడంతో మోసపోయామని భావించిన దంపతులిద్దరూ సోమవా రం చుంచుపల్లిలోని ఇంట్లో గడ్డిమందు తాగారు. చుట్టుపక్కల వాళ్లు అపస్మారక స్థితి లో ఉన్న వారిని కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో ఖమ్మం అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. సోమవారం అర్ధరాత్రి ఇద్దరూ మృతి చెం దారు. మంగళవారం వారి స్వగ్రామమైన సాయిరాంతండాలో అంత్యక్రియలు నిర్వహించారు. దంపతుల ఆత్మహత్యతో సాయిరాంతండాలో విషాదచాయలు అలుముకొన్నాయి.