calender_icon.png 6 October, 2024 | 10:01 AM

మూసీ పేరుపై లక్షకోట్ల అవినీతికి ప్లాన్

05-10-2024 01:16:23 AM

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ మూసీ సుందరీకరణ కోసం రూ.16 వేల కోట్లు ప్రతిపాదించారని రూ.3800 కోట్లతో స్పెషల్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, అందమైన బ్రిడ్జిలను నిర్మించినట్లు తెలిపారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో చిరుమళ్ల రాకేశ్‌కుమార్, తుంగబాలుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పట్ల సీఎం నోటికొచ్చినట్లు మాట్లాడటం భావ్యం కాదన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తారన్నారు.