calender_icon.png 29 September, 2024 | 10:02 PM

మట్టిపెల్లలు కూలి కార్మికుడు మృతి

29-09-2024 07:41:37 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కూకట్ పల్లి హానర్ కన్ స్ట్రక్షన్ లో జరిగిన ప్రమాదంలో వ్యక్తి ఆదివారం మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... కేబుల్ కోసం గుంతలు తవ్వుతున్న కార్మకుడిపై మట్టిపెల్లలు కూలి బీహార్ కు చెందిన రవి(21) అనే కార్మికుడు మృతి చెండాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.