కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కోదండరాం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాం తి): కార్మికుల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జనసమితి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఆకుల శ్రీనివాస్ బుధవారం తెలంగా ణ జనసమితిలో చేరారు. శ్రీనివాస్కు కోదండరాం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు.
కోదండరాం మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య ల పరిష్కారానికి తనవం తు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం మరింతగా పనిచేయాలనే ఉద్దేశంతోనే తెలంగాణ జనసమితిలో చేరినట్లు తెలిపారు. ఆకుల శ్రీనివాస్తో పాటు జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల సంఘం నాయకులు జహీర్, యాకయ్య, జగదీశ్, శివ, అనిత, మీనతోపాటు సుమారు 200 మంది పార్టీలో చేరారు.