calender_icon.png 13 March, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చలకు పిలిచిన కార్మిక శాఖ

13-03-2025 02:03:38 AM

17న కార్మిక భవన్‌కు ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు 

హైదరాబాద్ మార్చి 12 (విజయ క్రాంతి): ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో 6 కార్మిక సంఘా లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కార్మిక శాఖ ఇరు వర్గాలను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 17న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న కార్మిక భవన్ లో సాయంత్రం 4 గంటలకు జరగనున్న చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం, సమ్మె నోటీసు ఇచ్చిన కార్మి క సంఘాలను హాజరు కావాలంటూ కార్మిక శాఖ ఆహ్వానం అందించింది. గత నెల 10న కార్మిక శాఖ ఆర్టీసీ యా జమాన్యాన్ని చర్చలకు పిలిచినా ఎమ్మె ల్సీ కోడ్ సాకుగా చూపించి యాజమాన్యం చర్చలకు రాలేకపోయింది.