హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై రెండో రోజు కురియన్ కమిటీ ఆరా తీస్తోంది. గాంధీభవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, అభ్యర్థులతో కురియన్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ లోక్సభ స్థానాలకుగాను.. 14 సీట్ల వరకు గెలుస్తామని పెట్టుకున్న అంచనా తప్పి 8 స్థానాలకే పరిమితం కావడానికి గల కార ణాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలో ఏఐసీసీ నియమించిన త్రీమెన్ కమిటీ గురువారం గాంధీభవన్లో శుక్రవారం రోజు ఎంపీలు, ఎన్నికల్లో ఓడిన ఎంపీ అభ్యర్థులతో సమావేశమైంది.