ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆశయ సాధనకు కృషి చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలంలోని తాటిగూడ గ్రామంలో కుమ్రంభీం విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. ఆదివాసుల హక్కుల సాధన కోసం కుమ్రంభీం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తి తోనే తాను అనేక ఉద్యమాల్లో పాల్గొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. నేటి యువత కుమ్రంభీం ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమ్రంభీం మనువడు సోనేరావ్ పాల్గొన్నారు.