calender_icon.png 23 October, 2024 | 5:02 AM

తెలంగాణ భవన్‌లో కుమ్రంభీం జయంతి

23-10-2024 02:29:19 AM

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాల యం తెలంగాణ భవన్‌లో పోరాట యోధుడు కుమ్రంభీం జయంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవా రం ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళి అర్పించారు. ఈసందర్భంగా బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ  అతని ఆశయాల సాధనే ఎజెండాగా తెలంగాణ ప్రగతి ప్రస్థానం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, దేవీప్రసాద్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, కిషోర్‌గౌడ్, రాంచందర్ నాయక్  పాల్గొన్నారు.