calender_icon.png 22 September, 2024 | 11:51 AM

కుమ్మరి కృష్ణ హత్య కేసులో కుమారుడు అరెస్ట్

13-07-2024 03:07:56 PM

షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలంలో రియాల్టర్ హత్య కేసును పోలీసులు చేధించారు. కుమ్మరి కృష్ణను కుమారుడే హత్య చేయించాడని నిర్ధారించారు. కుమ్మరి కృష్ణ హత్య కేసులో మృతుడి కుమారుడిని అరెస్ట్ చేశారు. కుమ్మరి కృష్ణను మొదటి భార్య కుమారుడే హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి అంతా మూడో భార్యకు ఇస్తున్నాడని కుమారుడే హత్య చేయించినట్లు వెల్లడించారు. రూ. 25 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురితో హత్య చేయించినట్లు నిర్ధరించారు. నిందితుల నుంచి 3 కత్తులు, 2 కార్లు, బైకు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న షాద్ నగర్ లోని కేకే ఫామ్ హౌస్ లో కుమ్మరి కృష్ణ హత్యకు గురైన విషయం తెలిసిందే.