calender_icon.png 24 October, 2024 | 4:54 AM

ప్రేక్షకులకు పాదాభివందనాలు

21-07-2024 12:08:58 AM

వినోద్ కిషన్ కృష్ణ  హీరోహీరోయిన్లుగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేశ్ వర్రే నిర్మించిన చిత్రం ‘పేక మేడలు’. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో మహిళా సాధికారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నీలగిరి మాట్లాడుతూ.. “సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి 50కి పైగా కాల్స్ వచ్చాయి. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందిన.. మంచి ఎమోషనల్ సినిమా తీశారు అని ప్రశంసిస్తున్నారు.

ముఖ్యంగా ఆడవాళ్ల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా నిర్మాతకు, మూవీ టీమ్‌కు థ్యాంక్స్. సినిమాను ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు” అన్నారు. దాదాపు రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఈరోజు ఈ సక్సెస్ చూస్తుంటే భావోద్వేగం ఉప్పొంగుతోంది. ఇంకా ఇలాంటి మంచి చిత్రాలు తీయొచ్చు అనిపించింది. చిన్న సినిమాకు జనం రారు అనేది తప్పు.. మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే కచ్చితంగా థియేటర్‌కు వచ్చి మరీ మనల్ని ఆదరిస్తారు.

ఈ సక్సెస్ నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అదేవిధంగా ఈ సినిమా ప్రయాణంలో నాకు ఎంతో వెనుదన్నుగా నిలిచిన అనూష, కేతన్‌తోపాటు మార్కెటింగ్ టీమ్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇలాంటి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొం టున్నాను” అని అన్నారు చిత్ర నిర్మాత రాకేశ్.