హైదరాబాద్,(విజయక్రాంతి): కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగినట్లు లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు ఇస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది, తమ్ముడి కంపెనీలకు కాంట్రాక్లులు ఇస్తున్నారని, 9 నెలల టెండర్ల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెడుతోందని కేటీఆర్ దుయ్యాబట్టారు. అమృత్ పథకంలో జరిగిన టెండర్, పనులు, వివరాలు బహిర్గతం చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.