calender_icon.png 11 October, 2024 | 10:49 AM

కేటీఆర్ మాటలు మూసీకంటే కంపు

11-10-2024 01:00:49 AM

హర్యానాలో బీజేపీ గెలిస్తే బీఆర్‌ఎస్ సంబురాలా? 

కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి నిలదీత 

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): కేటీఆర్ మాటలు మూసీ కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. హర్యానాలో  కాంగ్రెస్  ఓటమి చెందితే తెలంగాణలో బీఆర్‌ఎస్ సంబురాలు చేసుకోవడంలో ఆంతర్యమమేమిటని ఆయన నిలదీశారు.

గురువారం  సీఎల్పీ కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హర్యానాలో ఈవీఎంల అవక తవకల వల్లే కాంగ్రెస్ ఓటమి చెందిందన్నారు. కశ్మీర్‌లో బీజేపీ ఓడిపోతే బీఆర్‌ఎస్ ఎందుకు స్పందించడం లేద ని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీపై కేటీఆర్, హరీశ్‌రావు విమర్శలు చేయడం సరికాదన్నారు.

రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుగుతుంటే కవిత ఎక్కడికి పోయిందని నిలదీశారు. మూసీ డీపీఆర్ కాక ముందే లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మూడు సీట్లు కూడా రావని  అన్నారు.