హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తండ్రి పురషోత్తంరెడ్డి మృతి చెందిన నేపథ్యంలో ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. సోమవారం హైదరాబాద్ కొండాపూర్లోని ఉత్తమ్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా పురషోత్తంరెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత ఉత్తమ్తో కుటుంబసభ్యులను ఓదార్చారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, పార్టీ నాయకులు పటోళ్ల కార్తీక్రెడ్డి, విజయ్కుమార్ ఉన్నారు.