calender_icon.png 14 October, 2024 | 6:33 PM

రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన కేటీఆర్

14-10-2024 04:30:22 PM

కూకట్ పల్లి: సినీనటుడు రాజేంద్రప్రసాద్ ను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే లు పరామర్శించారు. సోమవారం కూకట్పల్లి కెపిహెచ్బి కాలనీలోని ఆయన నివాసానికి వచ్చి గాయత్రి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాలుగు దశాబ్దాలుగా ఎంతోమంది జీవితాల్లో నవ్వులు నింపిన రాజేంద్రప్రసాద్  కూతురు చిన్న వయసులోనే మరణించడం తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కెపీ వివేకానంద్ కాలేరు వెంకటేష్ లు ఉన్నారు.