హైదరాబాద్: రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను శనివారం నిర్వహించారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ్మినేని నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసి సీతారాం ఏచూరి చివరిస్థాయిగా నిలిచారని తెలిపారు.
పదవులతో కీర్తి వస్తుందని కొందరు నేతలు అనుకుంటారని పేర్కొన్న కేటీఆర్ ప్రస్తుతం నేతలు పదవుల చుట్టూ పరిభ్రమిస్తున్నారని విమర్శించారు. పదవుల చుట్టూ కాకుండా సిద్ధాంతం చుట్టూ సీతారాం ఏచూరి పరిభ్రమించారని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు సీతారం ఏచూరి నిలబడ్డారని తెలిపారు. సీపీఎం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ కోదండరాం, బీఆర్ఎస్ నాయకులు, తదితర నేతలు పాల్గొన్నారు.