calender_icon.png 22 September, 2024 | 1:23 AM

రాష్ట్రంలో పాలన లేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది

17-09-2024 04:19:47 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో పాలనే లేదన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజా పాలన దినోత్సవం నిర్వహించారని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ విమర్శించారు.  తెలంగాణ భవన్ లో సెప్టెంబర్ 17ను పురస్కరించుకోని జాతీయ సమైక్యతా దినోత్సవం బీఆర్ఎస్ నిర్వహించింది. కేటీఆర్ఎస్ జాతీయ జెండాను ఎగరవేశారు. రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, విష జ్వరాలు విజృంభిస్తున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో పాలన లేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతోందని, ఇకనైనా కేసీఆర్, బీఆర్ఎస్ ను తిట్టడం మానేసి సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.