హైదరాబాద్,(విజయక్రాంతి): సామాన్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపి భయాన్ని సృష్టించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవటం చేతగాక, సామాన్యలపైకి బుల్డోజర్లను పంపారన్నారు. తీరా చూస్తే రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందని కేటీఆర్ తెలిపారు. హైడ్రా హైరానాతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని, 2 నెలల్లో రిజిస్ట్రేషన్లు పడిపోయాయి.. ఆదాయం తగ్గిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొత్త ఆదాయం సృష్టించకున్నా పర్వాలేదు.. ఉన్నది ఊడగొడుతున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నావో అర్థమైతుందా? మీ ఫోర్ బ్రదర్ సిటీపై ఫోకస్ చేసి, అక్కడ కృత్రిమ రియల్ బూమ్ కోసం ఆలోచిస్తున్నట్లు అన్నారు. సామాన్యులు కొనుగోలు, అమ్మకం లేనిది బూమ్ ఎట్లా వస్తది? ఆదాయం ఎట్లా పెరుగుతదని కేటీఆర్ వెల్లడించారు.