హైదరాబాద్,(విజయక్రాంతి): నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిలో బీఆర్ఎస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడారు. మెదక్ జిల్లా, శివంపేట మండలం గోమారం గ్రామంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై ఆదివారం అర్థరాత్రి కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దీంతో సునీత ఇంటిపై దాడి వివరాలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే సునీతాకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి దాడులతో సునితా లక్ష్మారెడ్డి మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.