calender_icon.png 23 October, 2024 | 5:02 PM

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్‌ బహిరంగ లేఖ

11-07-2024 03:33:27 PM

హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపిందన్నారు. అనేకసార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈసారి అయినా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తెప్పించండన్నారు. కేంద్రమంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండని కేటీఆర్ తెలిపారు. 

సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని పేర్కొన్నారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. నేతన్నలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలకుల వైఫల్యం వల్ల చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు గుడ్ న్యూస్ వచ్చేలా చూడాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు.