calender_icon.png 23 October, 2024 | 2:55 PM

బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

23-10-2024 12:51:54 PM

హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ నోటీసుల్లో ఆరోపించారు. తన వ్యాఖ్యలను బండి సంజయ్ వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. అసత్య ప్రచారం చేసినందుకు బహిరంగ క్షమాపన చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని ఆయన హెచ్చరించారు.

పరువునష్టం దావా, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, రేవంత్ రెడ్డి కలిసిపోయానన్న వ్యాఖ్యలు నిరూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఇష్టానుసారం మాట్లాడితే చట్టపరంగా చర్యలు తప్పవని సూచించారు. కేంద్రమంత్రిగా ఉండి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ హితువు పలికారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వెల్లడించారు.