calender_icon.png 3 October, 2024 | 6:47 PM

కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో

03-10-2024 04:49:30 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో తమపై పిచ్చిరాతలు రాస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆరే అన్నారు. గతంలో కేటీఆర్ సీఎంలా భావించి చెత్త నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కొండా సురేఖ ధ్వజమెత్తారు. పదవీకాంక్షతో కేసీఆర్ ని కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారముందన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్లు దగ్గరపెట్టుకోని మాట్లాడాలని మంత్రి సురేఖ హెచ్చరించారు. బడ్జెట్ రోజు వచ్చి కేసీఆర్ మళ్లీ కనపడలేదని మంత్రి చమత్కరించారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదన్నారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని సురేఖ ఆరోపించారు.