calender_icon.png 25 September, 2024 | 9:52 PM

కేటీఆర్ కనిపించడం లేదు..

25-09-2024 12:54:28 AM

పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నియోజకవర్గంలో కనిపించడం లేదని గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో బీజేపీ కిసాన్ మోర్చా మ ండలాధ్యక్షుడు కోడె రమేశ్ మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. గం భీరావుపేట మండల కేంద్రంతో పా టు పలు గ్రామాలు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నాయని చె ప్పారు.

నియోజకవర్గాన్ని పట్టించుకునే తీరిక మాత్రం ఎమ్మెల్యే కేటీ ఆర్‌కు లేకుండా పోయిందన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల ను గాలికి వదిలేయడం సరికాదన్నా రు. మూడు మండలాలకు ప్రధాన రహదారి అయిన గంభీరావుపేట మండల పరిధిలోని లింగన్నపేట వాగుపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ ఎమ్మె ల్యే నియోజకవర్గంలో అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.