calender_icon.png 23 October, 2024 | 9:00 AM

జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ?

10-07-2024 04:20:17 PM

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో.. జీన్యూస్ రిపోర్టర్, కెమెరామెన్ లను అక్రమంగా అరెస్టు  చేయడం దారుణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విధి నిర్వహణలో భాగంగా... జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా ? అని ప్రశ్నించారు. నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద.. మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తించారని మండిపడ్డారు. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్టును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా ? ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా ? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం ? అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి..ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయన్నారు.మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు అడగడుగునా  దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టులపట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న కేటీఆర్ ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. వెంటనే జీన్యూస్ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.