పెద్దపల్లి(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి నదిలో నీళ్లు లేక ఎండిపోయిన నీటి ప్రవాహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. మెడిగడ్డ సందర్షనకు వెళుతున్న క్రమంలో గోదావరి నది వద్ద కాసేపు ఆగి నదిని పరిశీలించారు. ఆయన వెంట బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు ఉన్నారు.