calender_icon.png 25 September, 2024 | 3:52 PM

అస్తిత్వం కోసం కేటీఆర్ డ్రామాలు

25-09-2024 02:20:15 AM

 కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): అస్తిత్వం కోసమే కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారని కేంద్ర  మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇంకా మీ వేషాలను జనం నమ్మబోరని కేటీఆర్‌ను ఉద్దేశించి పోస్టులో తెలిపారు. అమృత్ టెండర్ల విషయంలో కాంగ్రెస్‌తో కలిసి పబ్లిసిటీ కోసం స్టంట్లు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.  బీజేపీ ఎన్నడో అమృత్ టెండర్లపై స్పందించిందని గుర్తుచేశారు.  

పవిత్రాణాయ సాధూనాం 

సనాతన ధర్మంపై ఎవరైనా దాడి చేయాలనే చూస్తే హిందువులంతా ఐక్యంగా ఎదుర్కొంటామని ఏపీ డిఫ్యూ టీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన పోస్టుపై బండి  స్పందించారు. పవన్ శక్తివంతంగా మాట్లాడారని అభినందించారు.