హైదరాబాద్: తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ వేశారు. కేటీఆర్ తరుపు న్యాయవాది ఉమామహేశ్వరరావు పిటిషన్ దాఖాలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ ను సాక్షులుగా కేటీఆర్ పేర్కొన్నారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.