హైదరాబాద్: తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ ప్రభుత్వంపై సంచలన విమర్శరలు చేశారు. తెల్ల బంగారం తెల్లబోతున్నది.. బోనస్ దేవుడెరుగు..మద్దతు ధరకే దిక్కులేదన్నారు. దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొర్రీలతో సీసీఐ కొనుగోళ్లు నిలిపేసిందని మండిపడ్డారు. రైతన్న ఆగమైతుంటే..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేదని ఆరోపిపంచారు. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్లో చెప్పి..ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చున్నదని విమర్శించారు. రాష్ట్రంలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట పత్తి అని చెప్పిన మాజీ మంత్రి కేటీఆర్.. కీలకమైన కాటన్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చొరవ లేదు..శ్రద్ధలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే..దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేసారు.. సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు వేస్తున్నారు. పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిక్లరేషన్ బోగస్. కర్షక ద్రోహి కాంగ్రెస్ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.