calender_icon.png 28 October, 2024 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారు

28-10-2024 10:01:24 AM

హైదరాబాద్: ప్రజా పాలనలో దొంగలు..దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో దొరికినకాడికి దోచుకో… అందినంత దండుకో.. తెలంగాణలో ఇప్పుడిదే దందా నడుస్తున్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. అక్రమార్కులతో కాంగ్రెస్ నాయకులు చెట్టాపట్టాలేసుకొని సహజ వనరులను కొల్లగొడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. చీకటి వాటాలు.. సీక్రెట్  ఒప్పందాలు చేసుకొని యథేచ్ఛగా ఇసుకను మట్టిని బుక్కేస్తున్నారని విమర్శించారు. ఇది ఇసుకాసుర.. బకాసుర.. భస్మాసుర రాజ్యం ఇదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.