జ్యోతిబా పూలే విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు
హైదరాబాద్: జ్యోతిబా పూలే విదేశీ విద్య పథకానికి కాంగ్రెస్ పార్టీ తూట్లో పూడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బిడ్డలకు విదేశీ అందని ద్రాక్షేనా? అని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ తో సాధ్యం.. నేడు అసాధ్యం అన్నారు. పేద విద్యార్థులతో సర్కారు చెలగాటం ఆడుతోందని విమర్శించారు. దరఖాస్తు చేసుకుని ఏడాదవుతున్న నిర్లక్ష్యం? ఎందుకని ప్రశ్నించారు. వేలాది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఉపకార వేతనాలు విడుదల చేయాలని కేటీఆర్ హెచ్చరించారు.