హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం.. రైతు మహేందర్ రెడ్డి పాలిట శాపమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్యని ఆరోపించారు. రైతుల చావులకు గాంధీ కుటుంబం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చి మార్పు తెచ్చిందంటే ఏమో అనుకున్నామని చెప్పారు.
రైతుల చేతుల్లోకి పురుగుల మందు డబ్బా తెచ్చి పెట్టిందన్నారు. రైతు బంధు రాలేదు.. రుణమాఫీ కాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బక్కచిక్కిన రైతు పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెప్పారు. దీనికి కారణం అబద్దాలతో అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ కాదా..? రైతుల పరామర్శకు వెళ్తే అరెస్టులకు ఆదేశాలు ఇస్తారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.