calender_icon.png 3 October, 2024 | 4:48 PM

కేటీఆర్.. చిల్లర మాటలు మానుకో

03-10-2024 02:23:22 AM

మంత్రి పొన్నం హెచ్చరిక

హైదరాబాద్, అక్టోబర్ 2(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ చిల్లర మాటలు మానుకొని హూందాగా వ్యవహరించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హితువు పలికారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా బుధవారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. ఈ సందర్భం గా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పంది స్తూ.. రాష్ట్ర పరిపాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకురావడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.

మూసీ సుందరీకరణ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా ఒక ఇంటిని కూడా కూల్చబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోరుకుంటుందన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వీలైతే ప్రతిపక్ష పార్టీగా బాధ్యతతో నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరారు.