జడ్చర్ల, సెప్టెంబర్౧౯: మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రులు హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పరామర్శిం చారు. ఇటీవల మృతిచెందిన లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత ఏకాదశదిన కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా ఆవంచలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు శ్వేత చిత్రపటం వద్ద పుష్పంజలి ఘటించారు.