calender_icon.png 20 October, 2024 | 11:08 AM

టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కృష్ణయాదవ్

20-10-2024 02:31:28 AM

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): టీజీవో (తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్) అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఎంబీ.కృష్ణయాదవ్ ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీజీవో భవన్‌లో హై దరాబాద్ జిల్లా శాఖ ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి ఏ.సత్యనారాయ ణ సమక్షంలో శనివారం జరిగాయి.  ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎంబీ.కృష్ణ యాదవ్, సహా అధ్యక్షులుగా ఆశన్న, కార్యదర్శిగా మహ్మద్ అబ్దుల్ ఖాదర్, ఉపాధ్యక్షులుగా డా.ఎన్.సురేందర్, రాజేందర్, మంజులా రెడ్డి, కోశాధికారిగా ఎంవి.రమణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా పూనం తదితరులు ఎన్నికైన ట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస రావు అభినందించారు.