కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మెతుకు కృష్ణ చైతన్యను నియామకం చేసినట్లు తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వరుల గౌతం కుమార్ తెలిపారు. ఈ మేరకు కరీంనగర్ లో జరిగిన పద్మశాలి సంఘం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో కృష్ణ చైతన్యకు నియామక పత్రం అందజేశారు. జిల్లా యువజన సంఘంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, సంఘ అభివృద్ధికి విశేషంగా కృషి చేశాడని, వారి సేవలను గుర్తించి ఉపాధ్యక్షుడిగా నియామకం చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెతుకు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తన నియామకానికి సహకరించిన పద్మశాలి సంఘం జిల్లా నాయకులు, యువజన సంఘం నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.