calender_icon.png 4 October, 2024 | 6:56 PM

పేదల ఇళ్లకు రెడ్ మార్క్.. కూల్చినా అగ్నిగుండమే

04-10-2024 05:01:20 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వారెవరూ బీఆర్ఎస్ లో లేరని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం దాగి ఉందని, ఇళ్ల కూలగొడుతున్న ప్రాంతాలకు సీఎం రేవంత్ రెడ్డి భద్రత లేకుండా రావాలని కౌశిక్ రెడ్డి తెలిపారు. పేదల ఇళ్లపై ఆర్బీ అని రాస్తున్నారు.

ఆర్బీ అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అని, హుజూరాబాద్ లో కూడా పేదల ఇళ్లకు రెడ్ మార్క్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నా నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూల్చినా అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హెచ్చరించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే... తప్పు చేసే అధికారులను విడిచిపెట్టేది లేదన్నారు. బుల్డోజర్ రాజ్ అని మాట్లాడే రాహుల్ గాంధీ ఎక్కడున్నారు..? అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.