పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి తెలంగాణ సర్కారు రూ. కోటి నజరానాగా అందించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి దీప్తికి చెక్ అందించారు. దీప్తి కోచ్ నాగపురి రమేశ్కు సైతం రూ. 10 లక్షల చెక్ను బహుకరించిన సీఎం ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు.