అనారోగ్య పరిస్థితి ఉన్న అభ్యర్థికి ప్రత్యేక సదుపాయం కల్పించి సర్టిఫికెట్ల పరిశీలన చేశారు
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమంలో కొత్తగూడెం ఎంఈఓ ఎం ప్రభు దయాల్ మానవత్వాన్ని చాటుకున్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఎస్జిటి 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. ఈ క్రమంలో గుండాల మండలం నుంచి ఈసం విజయనిర్మల డెంగ్యూ వ్యాధితో తీవ్ర అనారోగ్య పరిస్థితికి గురై, బంధువుల సాయంతో సర్టిఫికెట్ల పరిశీలనకు కేంద్రానికి వచ్చారు. ఆమె పరిస్థితిని గమనించిన ఎంఈఓ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక సదుపాయాలు కల్పించి సర్టిఫికెట్ల పరిశీలన చేయటం గమనార్హం.