calender_icon.png 23 October, 2024 | 3:58 AM

చైతన్యవంతమైన జిల్లా కొత్తగూడెం

12-09-2024 01:28:56 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): కొత్తగూడెం అంటనే చైతన్యవంతమైన జిల్లా అని, ప్రతి పోలింగ్ బూత్‌లో 200ల బీజేపీ సభ్యత్వాలు చేసి రాష్ట్రంలోనే అగ్రభాగంలో ఉంచాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రామంలో ఆయన మాట్లాడారు.

ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చకుండా హైడ్రా అనే భూతంతో సంక్షేమ కార్యాక్రమాలను ఆపేసిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్, ఓటర్ నమోదు జిల్లా ప్రబారి శ్రీవర్ధన్‌రెడ్డి, సహ ప్రబారి రాజేష్, జిల్లా కన్వీనర్ పొనిశెట్టి వెంకటేశ్వర్లు, కో కన్వీనర్ ఐలయ్య పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిలో

కామారెడ్డి(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీజేపీ అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే దిశగా పార్టీ నేతలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో  బీజేపీ రాష్ట్ర కార్యవ్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, మర్రి బాలకిషన్, మోటూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.