calender_icon.png 7 October, 2024 | 7:08 PM

నల్లమలలో బతుకమ్మను పేర్చిన మంత్రి కొండా సురేఖ

07-10-2024 04:54:54 PM

అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంతంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. మార్కండేయ శివాలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఎంఎల్ఏ డాక్టర్ వంశీ కృష్ణతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళ భక్తులతో కలిసి మంత్రి బతుకమ్మ ఆడారు. అనంతరం నల్లమల కొండపై వెలసిన ఉత్తర ద్వారంగా పిలువబడుతున్న.. శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రతేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో మాధవి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు తదితరులు పుష్పగుచ్చం అందజేశారు.