calender_icon.png 22 September, 2024 | 4:36 AM

కొండా లక్ష్మణ్ ఆశయ సాధనకు కృషి

22-09-2024 02:01:16 AM

ఆదిలాబాద్/నిర్మల్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కొం డా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు ప్రభుతం కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆదిలాబాద్‌లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహా నికి పద్మశాలీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పద్మశాలీలు పూలమాలవేసి నివాళులర్పించారు.