calender_icon.png 17 October, 2024 | 6:05 PM

కొమురంభీం ఆశయ సాధనకు పాటుపడాలి...

17-10-2024 03:18:41 PM

బీజేపీ నేతలతో కలిసి భీం కు ఎమ్మెల్యే పాయల్ శంకర్ నివాళి...

ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆనాడు జల్.. జంగల్.. జమీన్.. కోసం నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు కొమురం భీం ఆని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకొని బీజేపీ పార్టీ నాయకులతో కలిసి ఆదిలాబాద్ లోని కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఆ మహనీయుడు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మారుతున్న పరిస్థితులలో ఆదివాసుల జీవితాలలో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీలు ఏవైనా కావచ్చు పాలకులు ఎవరైనా కావచ్చు ఆనాడు కొమురంభీం కన్నా కలలు, ఆశలను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గడచిన పదేళ్లలో ఆదివాసి బతుకులు మారలేదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా కొనసాగిస్తుందని ఎద్దవా చేశారు. ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకు ఇంత వరకు పట్టాలు ఇవ్వలేదన్నారు. వారి బతుకులను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల మంది రూపాయలు ఖర్చు చేసిందన్నారు. అయినప్పటికీ గతంలో ఉన్న ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు. అదే రీతిలో ఈ ప్రభుత్వం సైతం నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు లాలా మున్నా, జోగురావి, నైతం రవీందర్ద, శరథ్ పటేల్, రాకేష్, నగేష్ రెడ్డి, శ్రీనివాస్, అశోక్ రెడ్డి, సందీప్ తదితరులు ఉన్నారు.