calender_icon.png 1 October, 2024 | 3:10 AM

కోకాపేట్ గోల్డ్ ఫిష్ అధినేత చంద్రశేఖర్ అరెస్ట్

26-09-2024 11:36:39 AM

రాజేంద్రనగర్: కోకాపేట్ గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ ను సైబరాబాద్ ఈఓ డబ్ల్యూ అధికారులు అరెస్టు చేశారు. ఆయన 7 కోట్ల రూపాయల స్కామ్ చేసారంటూ ఈఓడబ్ల్యూ వింగ్ ను విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఈఓ డబ్ల్యూ అధికారులు ఆధారాలు స్వేకరించి చంద్రశేఖర్ ని గురువారం అరెస్ట్ చేశారు. అయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గం లో పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. చంద్రశేఖర్ పై మూడు పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేశారు.