calender_icon.png 4 October, 2024 | 6:52 PM

కోహ్లీ వల్లే సాధ్యమైంది

13-09-2024 12:52:24 AM

సౌతాంప్టన్: భారత్‌లో టెస్టు క్రికె ట్ ఇంతలా ఎదిగేందుకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రధాన కారణమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా దశ తిరిగింది. గత నాలుగేళ్లుగా రాహుల్ ద్రవిడ్ కూడా అదే చేశాడు. వారిద్దరికీ క్వాలిటీ ఆటగాళ్లు లభించారు. ఒక ఆసియా ఖండపు జట్టు ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం కోహ్లీ కెప్టెన్సీలోనే జరిగిం’ అని పాంటింగ్ తెలిపాడు.