27-03-2025 11:46:49 PM
అనుమానితుడి ఉద్దేశం తెలియదన్న పోలీసులు..
ఏరియాలో హైఅలర్ట్ ప్రజారవాణా బంద్..
అమ్స్టర్డామ్: అమ్స్టర్ డామ్లోని సెంట్రల్ డ్యామ్ స్కేర్ వద్ద జరిగిన కత్తి పోట్ల ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ దాడి వెనుక ఉద్దేశమేంటో ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. ‘ఈ దాడి వెనుక ఏ ఉద్దేశముందే మాకు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతోంది’ అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. కత్తిపోట్లు జరిగిన ప్రాంతం టూరిస్ట్ ప్రదేశం. చాలా మంది టూరిస్టులు ఆ ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ దాడి ఘటనతో ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజారవాణాను నిలిపేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి హెలికాప్టర్, అంబులెన్సులు చేరుకున్నాయి. ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో కత్తిపోట్ల కలకలం రేగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.