calender_icon.png 15 October, 2024 | 2:38 PM

Breaking News

కామారెడ్డి జిల్లాలో కత్తి పొట్ల కలకలం

15-10-2024 12:21:46 PM

పాత కక్షలతో  ముగ్గురుపై కత్తులతో దాడులు

ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఓ గ్రామంలో పాత కక్షలు నేపథ్యంలో కత్తిపోట్ల కలకలం సృష్టించింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం లింగంపల్లి గ్రామంలో కత్తిపోట్ల సంఘటన కలకలం రేపాయి. లింగంపల్లి గ్రామానికి చెందిన గుండెల్ని చిన్న సాయిలు కుమారులు మోహన్, అనిల్ కు అదే గ్రామానికి చెందిన మరొక వర్గానికి చెందిన వ్యక్తితో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల గ్రామస్తులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. అది మనసులో పెట్టుకున్న మరో వర్గానికి చెందిన సంతోష్, ప్రదీప్ మరొక స్నేహితుడు కలిసి సాయిలు కుటుంబంపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మోహన్, సాయిలు, అనిల్ కు గాయాలయ్యాయి. ఈ ఘటనలో సాయిలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు వల్లే కత్తి పోట్ల సంఘటన జరిగిందని  సదాశివ నగర్ పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ ఎస్సై పోలీస్ సిబ్బంది కలిసి గ్రామంలో జరిగిన కత్తి పోట్ల ఘటనపై విచారణ జరిపారు. బాధ్యులైన వారిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ తెలిపారు.