calender_icon.png 10 October, 2024 | 12:55 AM

ఆర్మీ జవాన్‌పై కత్తితో దాడి

09-10-2024 12:00:00 AM

గద్వాల (వనపర్తి), అక్టోబర్ 8 (విజయక్రాంతి): బతుకమ్మ సంబు రాల్లో ఓ వ్యక్తి సహనం కోల్పోయి ఆర్మీ జవాన్‌పై కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం రాత్రి చోటు చోసుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో సోమవారం రాత్రి మహిళలు మైక్ సౌండ్ ఏర్పాటు చేసుకుని బతుకమ్మ ఆడుతున్నారు. ఆ సమయంలో కృష్ణ అనే యువకుడు మైక్ సౌండ్ బంద్ చేయాలని మహిళలతో వాగ్వాదానికి దిగాడు.

సంబు రాలు అయ్యాక బంద్ చేస్తామని చెప్పినా వినకుండా వారిపై దాడికి పాల్పడ్డాడు. అదే కాలనీలో నివాసం ఉంటున్న ఆర్మీ జవాన్ మణివర్ధన్ అక్కడి చేరుకుని ఇరువర్గాలను శాం తింపజేసేందుకు యత్నించాడు. స హనం కోల్పోయిన కృష్ణ మణివర్ధన్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో మ ణివర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. చికి త్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తరలించారు. నిందితుడు కృష్ణను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు.