08-04-2025 05:50:11 PM
కోల్కతా: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా మంగళవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. కోల్కతా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్(87), మిచెల్ మార్ష్(81), ఐదెన్ మార్ క్రమ్(47) పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2, ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ పడగొట్టారు.